YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గ్రామీణ ప్రజలకు కీలకంగా ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం సమర్థవంతంగా అమలు కావడం అత్యంత కీలకమని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల చేతిలో ఖర్చు చేయగలిగే ఆదాయం పెరుగుతుందని, దాంతో గ్రామీణ మార్కెట్లలో వినియోగం పెరిగి ఆర్థిక చలనం వస్తుందని వివరించారు.
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఎక్కువగా ఖర్చు చేసే వర్గాల చేతిలో డబ్బు ఉంటే గ్రామీణ ఆదాయ వినియోగం పెరుగుతుందని, అది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అన్నారు వైఎస్ జగన్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో దేశవ్యాప్తంగా అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. అయితే, గత రెండేళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనితీరు తీవ్రంగా పడిపోయిందని జగన్ విమర్శించారు. లేబర్ బడ్జెట్, పని చేసిన కుటుంబాల సంఖ్య, ఖర్చు చేసిన నిధులు వంటి అన్ని అంశాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోందని ఆరోపించారు.
గత రెండేళ్లలో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ వృద్ధి రేట్లు కూడా తగ్గాయని జగన్ తెలిపారు. ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందనే సంకేతమని అన్నారు. ప్రజల చేతిలో డబ్బు లేకపోవడంతో డిమాండ్ పడిపోతుందని, దాని ప్రభావం వ్యాపార రంగంపై కూడా పడుతోందని చెప్పారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం విఫలమవుతోందని దుయ్యబట్టారు.. అవినీతి ఆరోపణలు, సంపద కూడబెట్టాలనే అధిక ఆశలతో ప్రభుత్వం దారి తప్పుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴
From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to… pic.twitter.com/KSvPGgVEsJ
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!