Liquor Sales: మద్యం అమ్మకాల వ్యవహారంపై మండలిలో రచ్చ.. కొల్లు రవీంధ్ర కామెంట్లతో..
- మద్యం అమ్మకాలపై మండలిలో చర్చ..
- మద్యం కుంభకోణంపై సిట్ వేశామన్న మంత్రి కొల్లు రవీంద్ర..
- సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టారని ఆరోపణ..
- కొల్లు రవీంద్రపై మండిపడ్డ బొత్స సత్యనారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మద్యం అమ్మకాలపై చర్చ కాస్తా.. అధికార, ప్రతిపక్షం మధ్య శాసనమండలిలో కాకరేపింది.. మద్యం విక్రయాలు, అక్రమాలపై మండలిలో మాట్లాడిన మంత్రి మంత్రి కొల్లురవీంద్ర.. మద్యం కుంభకోణంపై సిట్ వేశాం. సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఎంతమంది ఈ అక్రమాల్లో ఉన్నారో తేలుస్తాం… సీఐడీ విచారణలో అన్నీ తేలుస్తాం అన్నారు.. ఇక, మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.. శాసనమండలి విపక్షనేత బొత్స మాట్లాడుతూ.. తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం.. తాడేపల్లి ప్యాలెస్ లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు.. రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు.. ఆధారాలుంటే రుజువుచేయండి. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు. తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్ లో ఎంక్వైరీ బైండింగ్స్ లో చేర్చుకోండి అని సవాల్ చేశారు బొత్స.
Read Also: Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో తప్పుల తడకలు..
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
అయితే, తాడేపల్లి ప్యాలెస్ వద్ద అగ్ని ప్రమాదం పై విచారణ జరిపించామని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. మాదగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ప్రభుత్వ సీసీ కెమెరాల్లో కొంతమేర ఆధారాలున్నాయి. అక్కడున్న ఇంటి నుంచి వచ్చి తగలబెట్టినట్లు మాకు సమాచారం వచ్చింది. బాధ్యత కలిగిన వ్యక్తులైతే సమాచారం ఇవ్వాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. మా నాయకుడిపై దాడి చేయాలని చూశారంటూ తిరిగి కేసు పెట్టారి ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు.. ఇక, ఈ అంశంలో కలుగజేసుకున్న హోం మంత్రి అనిత… ఏదైనా సంఘటన జరిగినప్పుడు చుట్టుక పక్కల సీసీ కెమెరా ఉంటే ఎవరైనా ఆ ఫుటేజ్ ని పోలీసులకు ఇవ్వాల్సిందే.. అది రూల్ లో ఉందన్నారు.. నిజంగా మీ నాయకుడికి భద్రత భయం ఉంటే విచారణకు మీరు ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు.. మీ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎందుకు ఇవ్వరు..? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు హోం మంత్రి అనిత.. మరోవైపు.. శాసనమండలి విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు.. మీ దయా దాక్షిణ్యాలతో మేం ఇక్కడ కూర్చోలేదన్న ఆయన. మాకు సభలో మాట్లాడే హక్కు ఉంది. తాడేపల్లి ప్యాలెస్ అనే పదం వాడటం సరికాదు.. ప్యాలెస్ లు అందరికీ ఉన్నాయని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..