Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు..
- ఇప్పటికే ఎన్నికలపై మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు..
- ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి తీసుకున్న SEC..
- రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగుతోంది.. ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా కసరత్తు సాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలకు పలు కీలక సూచనలతో లేఖలు పంపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలని రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం అవసరమైన పెద్ద మొత్తంలో బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుండి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అదనంగా పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల విధులకు అందించాలని కూడా SEC భావిస్తోంది.
Read Also: Andhra Pradesh: సీఎస్ సర్వీసు పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం…
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
వైసీపీ ప్రభుత్వం కాలంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి, ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అయితే, గ్రామ పంచాయతీల పదవీ గడువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2తో ముగుస్తుంది.. మున్సిపల్ సంస్థల గడువు మార్చి 17తో ముగుస్తుంది. MPTC, ZPTC ఎన్నికల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీలతో ముగియనుంది.. మొత్తం 127 మున్సిపాలిటీలలో, 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, 23 చోట్ల ఎన్నికలు జరగలేదు. 17 చోట్ల దశల వారీగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!