Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Rmz To Invest %e2%82%b91 Lakh Crore In Ap 1 Lakh Jobs Gcc Park And Data Centers Announced At Davos

RMZ Invest RS. 1 Lakh Crore in AP: ఆర్‌ఎంజడ్‌ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు..

Published Date :January 20, 2026 , 7:54 pm
By Sudhakar Ravula
  • ఏపీలో ఆర్‌ఎంజడ్ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు..
  • మంత్రి నారా లోకేష్ సమక్షంలో దావోస్‌లో కీలక ప్రకటన..
  • లక్ష ఉద్యోగాల కల్పనకు దారితీసే భారీ ప్రాజెక్టులు..
RMZ Invest RS. 1 Lakh Crore in AP: ఆర్‌ఎంజడ్‌ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

RMZ Invest RS. 1 Lakh Crore in AP: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి లభించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రముఖ రియల్ ఎస్టేట్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆర్‌ఎంజడ్ (RMZ) గ్రూప్ రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం సందర్భంగా, ఆర్‌ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. దావోస్‌లో మంత్రి లోకేష్, మనోజ్ మెండాల మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి.

విశాఖలో భారీ GCC పార్క్
ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖపట్నంలో GCC (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్) ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా, విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో, 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భారీ GCC పార్క్‌ను అభివృద్ధి చేయడానికి RMZ గ్రూప్ అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ, డిజిటల్ సేవలు, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలం చేకూరనుంది.

హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్
విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా 1 గిగావాట్ లక్ష్య సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కూడా RMZ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా. డేటా సెంటర్లు.. నెక్ట్స్ జెన్ డిజిటల్, ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతు.. స్థిరత్వం (Sustainability).. గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్‌కు ప్రాధాన్యత.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయనున్నట్లు RMZ ప్రకటించింది. మరోవైపు.. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా, టేకులోడు వద్ద RMZ గ్రూప్ సుమారు 1,000 ఎకరాల్లో ఒక భారీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పారిశ్రామిక తయారీ.. గిడ్డంగులు.. లాజిస్టిక్స్ కార్యకలాపాలు.. విస్తృతంగా అభివృద్ధి చెందనున్నాయి… ఈ అన్ని ప్రాజెక్టులను కలిపి, రాబోయే ఐదేళ్లలో RMZ గ్రూప్ సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ. లక్ష కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఏపీ ప్రభుత్వ కమిట్‌మెంట్
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మరోసారి సింగిల్ విండో విధానం.. కాలపరిమితులతో కూడిన అనుమతులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. అంశాలపై తమ పూర్తి కమిట్‌మెంట్‌ను స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా, RMZ గ్రూప్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు కొత్త ఊపునిస్తూ, విశాఖపట్నం మరియు రాయలసీమ ప్రాంతాల అభివృద్ధిలో కీలక మలుపుగా నిలవనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP investment news WEF 2026
  • IT jobs in Andhra Pradesh
  • Nara Lokesh Davos meeting
  • Rayalaseema industrial logistics park
  • RMZ data center project AP

తాజావార్తలు

  • IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!

  • LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!

  • CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

  • T20 World Cup 2026 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ రేస్‌లో ఉంది వీరే .. భారత్‌ నుంచి ఒకేఒక్కడు.. బుమ్రాకు దక్కని చోటు..!

  • Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions