Minister Narayana: ఆ ఇద్దరి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది..
- అమరావతి రాజధాని నిర్మాణం ఆగదు..
- రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు..
- జర్నలిస్టుల వ్యాఖ్యల వెనుక జగన్ ప్రమేయం ఉంది: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. జగన్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి రూ. 10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్ళడం.. ఏపీలో రూ. 85లక్షల టన్నుల చెత్తను వదిలేశారు.. ఏపీని స్వచ్ఛాంధ్రాగా మారుస్తున్నాం.. మచిలీపట్నంలో సీఎం ప్రకటన చేసిన విధంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం.. పెన్షన్లను పెంచాం.. నిన్న ఒక్కరోజే రూ.10 వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా ఖాతాల్లో జమ చేశామని పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: PM Modi: “సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
అలాగే, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నాం అని మంత్రి నారాయణ తెలిపారు. మహిళలకు ఆగష్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తాం.. అన్న క్యాంటీన్ ద్వారా రోజుకు 2 లక్షల 20 వేల మందికి ప్రతిరోజు భోజనం అందిస్తున్నాం.. ఏసీ రూమ్స్ లో కూర్చుని మాట్లాడటం కాదు.. రాజధానిలో జరుగుతున్న పనులు వచ్చి చూడాలని సవాల్ చేశారు. ఇక, జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, క్రిష్ణుంరాజుల వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని ఆయన ఆరోపించారు. టిడ్కో బాధితులను ఆదుకుంటాం.. ఇప్పటి వరకు 50 లక్షల టన్నుల చెత్త తొలగించాం.. మరో మూడు నెలల్లో 3.50 లక్షల టన్నుల చెత్త తొలగిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో రోజుకు 2500 టన్నులు చెత్త ప్రాసెస్ చేయాలి.. కాంట్రాక్ట్ సంస్థ 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేస్తోంది అన్నారు. మరిన్ని అదనపు యంత్రాలు పెట్టి.. చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!