Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు
- బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి చట్ట సవరణ బిల్లుతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదని వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభలో రాజధాని అమరావతి చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చ సందర్భంగా మిధున్రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ‘చట్ట సవరణ బిల్లు’ ప్రజలకు ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని.. చట్ట సవరణ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం సవరణ బిల్లు స్వరూపం సరైందిగా లేదని… అందుకే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
- YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
‘‘అమరావతి కోసం 33 వేల మంది రైతులు భూమిలిచ్చారు. భూమిలిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. తనకు ప్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల గురించి పట్టింపు లేదు. అమరావతి అనే పేరు మాత్రమే కాదు.. రైతులకు ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. రాజధాని నిర్ణయం రాష్ట్రం ఇష్టమని గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి మాట్లాడితే బాగుండేది. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది.’’ అని మిధున్రెడ్డి ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా మిధున్ రెడ్డి వెల్లడించారు. దీంతో వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Nijjar Killing: ఖలిస్తానీ నిజ్జర్ను చంపింది మేమే.. గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సంచలనం..
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!