Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు
- బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి చట్ట సవరణ బిల్లుతో ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగదని వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభలో రాజధాని అమరావతి చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లుపై చర్చ సందర్భంగా మిధున్రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ‘చట్ట సవరణ బిల్లు’ ప్రజలకు ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని.. చట్ట సవరణ బిల్లుకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం సవరణ బిల్లు స్వరూపం సరైందిగా లేదని… అందుకే వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
‘‘అమరావతి కోసం 33 వేల మంది రైతులు భూమిలిచ్చారు. భూమిలిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు ఇస్తారో బిల్లులో పెట్టాలి. రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదు. తనకు ప్లాట్ ఇవ్వాలంటూ రామారావు అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల గురించి పట్టింపు లేదు. అమరావతి అనే పేరు మాత్రమే కాదు.. రైతులకు ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. రాజధాని నిర్ణయం రాష్ట్రం ఇష్టమని గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం గురించి మాట్లాడితే బాగుండేది. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లే ఖర్చు చేసింది.’’ అని మిధున్రెడ్డి ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా మిధున్ రెడ్డి వెల్లడించారు. దీంతో వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!