AP High Court: వైఎస్ జగన్ భద్రతపై పిటిషన్.. హైకోర్టులో కీలక వాదనలు
- నెల్లూరు పర్యటనలో వైఎస్ జగన్ భద్రతపై హైకోర్టులో వాదనలు..
- హెలిప్యాడ్ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్ అనుమతి పిటిషన్ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఇదే హెలిప్యాడ్ అన్నారు. హెలిప్యాడ్కోసం సూచించిన స్థలంలో మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉందని.. తుప్పలు, డొంకలు ఉన్నాయి.. హెలిప్యాడ్ కోసం సిద్ధం చేయాలంటే మూడు నాలుగు రోజులు పట్టేలా ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రం పాటించడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. పర్యటనల సమయంలో రోప్ పార్టీలు కూడా ఇవ్వడం లేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం.. కానీ, రోప్ పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడు మూతలు ఆడుతుందో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్పార్టీలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు.. జగన్ కు సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉంది.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. జగన్ కి భద్రత పెంపుపై గతంలో వేసిన 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అయితే, నిరర్థకమైన విషయంలో పిటిషన్ ఫైల్ చేశారంటూ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హైకోర్టుకు తెలిపారు.. రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం వాదనలు వినిపించారు. ఇక, వచ్చే బుధవారం వరకూ వాయిదా కోరారు ఏజీ.. దీంతో, వచ్చే బుధవారానికి విచారణ వాయిదా వేశారు న్యాయమూర్తి.. కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!