AP High Court: వైఎస్ జగన్ భద్రతపై పిటిషన్.. హైకోర్టులో కీలక వాదనలు
- నెల్లూరు పర్యటనలో వైఎస్ జగన్ భద్రతపై హైకోర్టులో వాదనలు..
- హెలిప్యాడ్ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్ అనుమతి పిటిషన్ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే హడావిడిగా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఇదే హెలిప్యాడ్ అన్నారు. హెలిప్యాడ్కోసం సూచించిన స్థలంలో మనుషులుకూడా నడవడానికి వీల్లేకుండా ఉందని.. తుప్పలు, డొంకలు ఉన్నాయి.. హెలిప్యాడ్ కోసం సిద్ధం చేయాలంటే మూడు నాలుగు రోజులు పట్టేలా ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఇక, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ విషయంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్రం పాటించడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. పర్యటనల సమయంలో రోప్ పార్టీలు కూడా ఇవ్వడం లేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు మేనేజ్ చేయడానికి రోప్ పార్టీలు అత్యంత అవసరం.. కానీ, రోప్ పార్టీలు ఇవ్వడానికి ప్రభుత్వ ఎందుకు దాగుడు మూతలు ఆడుతుందో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులకు రోప్పార్టీలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు.. జగన్ కు సేఫ్ ల్యాండింగ్, సేఫ్ ట్రావెల్, సేఫ్ మూవ్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉంది.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.. జగన్ కి భద్రత పెంపుపై గతంలో వేసిన 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అయితే, నిరర్థకమైన విషయంలో పిటిషన్ ఫైల్ చేశారంటూ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.. జడ్ ప్లస్ కింద ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హైకోర్టుకు తెలిపారు.. రోప్ పార్టీలు లేవు కదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరాం వాదనలు వినిపించారు. ఇక, వచ్చే బుధవారం వరకూ వాయిదా కోరారు ఏజీ.. దీంతో, వచ్చే బుధవారానికి విచారణ వాయిదా వేశారు న్యాయమూర్తి.. కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!