Floods Damage in AP: అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం.. ప్రాథమిక అంచనాలు దాటేస్తోంది..
- ఏపీలో అంతకంతకు పెరుగుతోన్న వరద నష్టం..
- ప్రాథమిక అంచనా ప్రకారమే రూ 6882 కోట్ల మేర నష్టం..
- కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం..
- క్రమంగా పెరిగిపోతున్న నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Floods Damage in AP: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. ముఖ్యంగా విజయవాడను అతలాకుతలం చేశాయి.. అయితే, ఏపీలో అంతకంతకు పెరుగుతోంది వరద నష్టం. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6882 కోట్ల మేర నష్టం వాటిలినట్టు కేంద్రానికి ఏపీ సర్కార్ ఇప్పటికే నివేదిక పంపింది.. మరోవైపు.. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటికే 46 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.. ఇక, అంతకంతకు వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ జరిగిన డ్యామేజ్ లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులకు అంచనాలు ఉన్నాయట..
Read Also: Budameru Floods: కొల్లేరుకు భారీగా బుడమేరు వరద.. 9 గ్రామాలకు రాకపోకలు బంద్..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
రాష్ట్రంలో జరిగిన వరద నష్టం విషయానికి వస్తే.. 4.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు, 200 ఎకరాల్లో సెరీకల్చర్ కు నష్టం జరిగిందట.. ఏపీలో మొత్తంగా 5921 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. 4203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బతింటే.. పంచాయతీల పరిధిలో 1160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్డులు డ్యామేజ్ అయ్యాయట.. ఇక, 540 పశువులు మృత్యువాత పడగా.. కిలో మీటర్ల మేర 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు దెబ్బతిన్నాయి.. 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడిపోయాయి.. వరదలకు 1283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ దెబ్బతిన్నాయి.. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడి అపార నష్టాన్ని మిగిల్చాయి.. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు.. చెరువులకు గండ్లు పడినట్టు అధికారులు చెబుతున్నారు.. ఇలా అంతా లెక్కిస్తూ పోతుంటే.. వరద నష్టం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!