CM Chandrababu: మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. జాగ్రత్త.. వైసీపీ ట్రాప్లో పడొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పడకూడదని సూచించారు.
Read Also: Sanjay Raut: అజిత్ పవార్ మరణంపై ఏదో సందేహం కలుగుతోంది.. దర్యాప్తు చేయాలన్న సంజయ్ రౌత్
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసే బాధ్యత మంత్రులు, సీనియర్ నేతలపై ఉందని సీఎం స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఎక్కడా రాకూడదని హెచ్చరించారు చంద్రబాబు.. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని చంద్రబాబు పేర్కొన్నారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ఏపీకి భారీగా పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.
మరోవైపు.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టీడీపీ మంత్రులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే వైసీపీ ప్లాన్ను ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైసీపీ నేతలు బూతు పురాణం ఎత్తుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్న నేతలకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర శాంతిభద్రతలు, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేతలు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!