CM Chandrababu Serious: కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్పై సీఎం చంద్రబాబు సీరియస్..!
- అసెంబ్లీలో వరుస పరిణామలపై సీఎం అసంతృప్తి..
- పార్టీ సీనియర్ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ..
- కామినేని, బాలయ్య వ్యవహారంసై చంద్రబాబు సీరియస్..
- బోండా ఉమా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది.. తాజాగా, కామినేని శ్రీనివాస్ ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణం అయ్యాయి.. అయితే, అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం.. పార్టీ సీనియర్ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట.. బోండా ఉమా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు..
Read Also: Hyderabad Floods: జలదిగ్బంధంలో హైదరాబాద్.. ఇళ్లు ఖాళీ చేస్తున్న మూసీ పరివాహక ప్రజలు..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
అసలు సభ ఎలా జరుగుతోంది.. అనే అంశంపై దృష్టి పెట్టాలి కదా? అని చీఫ్ విప్తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆడిగినట్టు సమాచారం.. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్కు సంబంధించి సీఎం సీరియస్గా రియాక్ట్ అయ్యారట.. కొంతమంది అధికారుల బదిలీల విషయాల్లో సభలో ప్రస్తావనపై కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ సెలబ్రిటీలు అప్పటి సీఎం వైఎస్ జగన్ను కలిసిన సందర్భంపై కామినేని శ్రీనివాస్ మాట్లాడగా.. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.. కామినేని వర్సెస్ బాలయ్యగా ఈ ఎపిసోడ్ ఉన్నా.. మధ్యలో వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన రావడంతో.. చివరకు చిరంజీవి కూడా దీనిపై స్పందించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!