Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంధన కొరత సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ రోజు సాయంత్రానికి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రం నాటికి రిటైల్ పెట్రోల్ బంకులకు చేరుకుంటాయని సమాచారం ఇచ్చారు.
Read Also: Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడానికి అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షణ చేపట్టి ఇంధన సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, అలాగే క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రజల్లో అనవసర ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ట్యాంకర్లు చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. సరఫరాలో ఆలస్యం జరిగితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక, బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు, అధికారులు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..