AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్చాట్ చేశారు. అయితే, విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలంటూ పిలుపునిచ్చారు.. అసెంబ్లీకి హాజరుకావడం ఎమ్మెల్యేల విధి అని స్పష్టం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. కొందరు సభ్యులు సభకు హాజరుకాకుండానే జీతాభత్యాలు తీసుకుంటున్నారని.. సభకు హాజరుకాని సభ్యులకు జీతం కట్ చేయాలి కదా? అని ప్రశ్నించారు.. ఈ అంశాలన్నీ జాతీయ స్థాయిలో చర్చ చేపట్టామని… ఈ నిబంధన దాదాపు 8 దేశాల్లో అమల్లో ఉందన్నారు. ఇక, అసెంబ్లీలో నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పని చేస్తోందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. కాగా, తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మొక్కుబడిగా.. అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజు హాజరై.. ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.. మండలికి హాజరైన శాసన సభకు మాత్రం హాజరుకాకపోడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఎమ్మెల్యేల హాజరు విషయంపై చంలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..
Read Also: Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్గా..!
