AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ స్థానాలు..
- ఎన్డీఏ భేటీలో కుదిరిన ఒప్పందం..
- కూటమి పార్టీల ఉమ్మడి కార్యాచరణ..
- రెండేళ్ల కూటమి పాలన పై కార్యక్రమాలు..
- ఈ నెల 9న. తిరుపతి లో సంక్షేమంపై కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP NDA: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాజ్యసభ స్థానాల పంపకం దాదాపు ఖరారైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రానికి కేటాయించిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు దక్కనున్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో జరిగిన కూటమి పార్టీల సమావేశం అనంతరం మాట్లాడిన పల్లా శ్రీనివాస్, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంయుక్త కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను వివరించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 9వ తేదీన తిరుపతిలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 13, 16, 17, 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వివరించారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ (SIR) ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రక్రియపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు పల్లా శ్రీనివాస్..
Also Read
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ఇక, జనసేన పార్టీ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారని వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 12న అమరావతిలో జరిగే సభలో సుపరిపాలన ఫలితాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాజ్యసభ స్థానాల పంపకం, రెండేళ్ల కూటమి పాలన ప్రచారం, మోడీ ప్రభుత్వ 12 ఏళ్ల విజయోత్సవాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!