Minister BC Janardhan Reddy: రాయలసీమ ప్రజలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు.. బీసీ జనార్ధన్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: రాయలసీమ అభివృద్ధి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరిని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ రాయలసీమ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. గతంలో కర్నూలు పర్యటనకు వచ్చిన జగన్.. కుందూ నదిని వెడల్పు చేస్తానని హామీ ఇచ్చి, ఆ పనులను తన అనుచరులకు కేటాయించుకుని రాజకీయ లబ్ధి పొందారని మంత్రి ఆరోపించారు. అవుకు టన్నెల్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ను కూడా జగన్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. అలాగే, గోరుకల్లు రిజర్వాయర్, గాలేరు–నగరి ప్రాజెక్టు వంటి కీలక నీటి ప్రాజెక్టులను కూడా కూటమి ప్రభుత్వమే పూర్తి చేసిందని, అయినా జగన్ అభివృద్ధిని తమ ఘనతగా చెప్పుకోవడం తగదన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా.. వైసీపీ పార్టీ కోసం పనిచేసే రాజకీయ నిరుద్యోగులకు ఆదాయం తెచ్చిపెట్టే వనరులుగా మారాయని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఎయిర్పోర్టును తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తే, జగన్ తన పాలనలో తన తండ్రి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధి మేము చేస్తే, ప్రచారం మీరు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా జగన్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని.. కానీ, 175 సీట్ల లక్ష్యానికి మద్దతు ఇచ్చింది, 40 నుంచి 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసింది కూడా ప్రజలే కదా? అని అన్నారు.
అసెంబ్లీ సాక్షిగా తేల్చుకుందాం అంటూ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.. నిజంగా రాయలసీమపై ప్రేమ ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావాలి.. మీ ఎమ్మెల్యేలను సభకు పంపితే.. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.. చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా చర్చకు రెడీగా ఉంది.. రాజకీయ డ్రామాలు మానుకోవాలి అంటూ జగన్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధి అంశాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం తగదని, ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మంత్రులదే అని బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..