AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Junior Doctors Strike: స్టైఫండ్ పెంపు డిమాండ్తో సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగియగా.. జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు.. అంతేకాదు.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జూడాలు..
స్టైఫండ్ను 30 శాతం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. కనీసం 20 శాతం అయినా పెంచాలని చర్చల సందర్భంగా కోరినట్లు తెలిపారు. అయితే 20 శాతం పెంపు కూడా సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్లకు ఏటా 3 శాతం, హౌస్ సర్జన్లకు 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి జూనియర్ డాక్టర్లతో సమావేశమవుతామని మంత్రి సత్యకుమార్ చెప్పినట్లు సమాచారం. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
- AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
సమ్మె కొనసాగిస్తామన్న జూడాలు
అయితే ప్రభుత్వం నుంచి తమ ప్రధాన డిమాండ్పై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో జూడాలు యథావిధిగా విధులకు దూరంగా ఉండి సమ్మె కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇదిలా ఉండగా రాష్ట్ర జూడాల సంఘం సమావేశం రేపు ఉదయం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించి, సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం APJUDA రాష్ట్ర ప్యానెల్ మీడియాతో మాట్లాడి.. చర్చల్లో జరిగిన అంశాలు, తమ తదుపరి కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించనుంది.
తాజావార్తలు
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!