AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Junior Doctors Strike: స్టైఫండ్ పెంపు డిమాండ్తో సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగియగా.. జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు.. అంతేకాదు.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జూడాలు..
స్టైఫండ్ను 30 శాతం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. కనీసం 20 శాతం అయినా పెంచాలని చర్చల సందర్భంగా కోరినట్లు తెలిపారు. అయితే 20 శాతం పెంపు కూడా సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్లకు ఏటా 3 శాతం, హౌస్ సర్జన్లకు 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి జూనియర్ డాక్టర్లతో సమావేశమవుతామని మంత్రి సత్యకుమార్ చెప్పినట్లు సమాచారం. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
సమ్మె కొనసాగిస్తామన్న జూడాలు
అయితే ప్రభుత్వం నుంచి తమ ప్రధాన డిమాండ్పై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో జూడాలు యథావిధిగా విధులకు దూరంగా ఉండి సమ్మె కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇదిలా ఉండగా రాష్ట్ర జూడాల సంఘం సమావేశం రేపు ఉదయం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించి, సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం APJUDA రాష్ట్ర ప్యానెల్ మీడియాతో మాట్లాడి.. చర్చల్లో జరిగిన అంశాలు, తమ తదుపరి కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించనుంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!