AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, నిందితులు దాఖలు చేసిన పిటిషన్ల మీద వచ్చే నెల 6వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
Read Also: Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
