AP Government Job Recruitment: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక కేడర్ ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Job Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించేలా స్థానిక కేడర్ విధానాన్ని ఖరారు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది విడుదల చేసిన ఉత్తర్వులను పునఃసమీక్షించి తాజా మార్పులతో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాన్ని మొత్తం ఆరు జోన్లు మరియు మల్టీ జోన్లుగా విభజించారు. ఉద్యోగాల స్వభావం, వేతన స్థాయి ఆధారంగా పోస్టులను జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలుగా వర్గీకరించారు. దీని ద్వారా నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Also: TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మొత్తం పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకు కేటాయించనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులను ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇవ్వనున్నారు. స్థానికులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికతను నిర్ణయించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలను నిర్ణయించింది. వరుసగా నాలుగేళ్లు ఒక ప్రాంతంలో నివాసం ఉండటం లేదా అక్కడే చదువుకోవడం ఆధారంగా అభ్యర్థి స్థానికతను ఖరారు చేయనున్నారు. దీంతో స్థానికతపై వివాదాలకు చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే కొన్ని కీలక విభాగాలకు మినహాయింపులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్వోడీ (Head of Department) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలకు ఈ స్థానిక కేడర్ నిబంధనలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. స్థానిక అభ్యర్థులకు అధిక అవకాశాలు కల్పించడంతో పాటు నియామకాలలో సమతుల్యత తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్లో డీజే బూత్నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!