Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- రేపు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు..
- 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలివిడత నిధులు జమ చేయనున్న ప్రభుత్వం..
- అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ద్వారా ఈ ఏడాది తొలి విడతగా రూ.3,125 కోట్ల పంపిణీ..
- 46.85 లక్షల రైతు కుటుంబాలకు కలగనున్న లబ్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా… కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది.
గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి.
Also Read
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు పర్యటన ఇలా…
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 3.50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6.20 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?