AP Government: గ్రామ పంచాయతీల విభజన, విలీనానికి తాత్కాలిక బ్రేక్..!
- గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్..
- కోర్టు కేసులు, జనగణన, పాలకవర్గ పదవీకాలం ప్రధాన కారణాలు..
- రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం..
- ఎన్నికల నేపథ్యంలో సవరణలు, తదుపరి ప్రక్రియపై కేబినెట్లో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియకముందే విలీన ప్రతిపాదనలపై కీలక సవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి.. కానీ, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు, అలాగే రాబోయే జనగణన ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది..
Read Also: Bengaluru: కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
అయితే, పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఇంకా కొనసాగుతుండటం వల్ల మధ్యలో విలీనాలు చేపట్టడం సరైంది కాదన్న అభిప్రాయం.. గ్రామాల విభజన, విలీనంపై కోర్టుల్లో పెండింగ్ కేసులు ఉండటం.. త్వరలో చేపట్టనున్న జాతీయ జనగణన కారణంగా గ్రామాల జనాభా, సరిహద్దులు, భౌగోళిక వర్గీకరణలో మార్పులు వచ్చే అవకాశం ఉండటం కూడా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోవడానికి కారణంగా చెబుతున్నారు.. పలు పరిపాలనా, చట్టపరమైన సవరణలు పరిశీలనలో ఉండటం.. ఈ అన్ని అంశాలను సమీక్షించిన తర్వాతే.. విభజన లేదా విలీన ప్రక్రియను కొంతకాలం నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు విభజన లేదా విలీనానికి సంబంధించి తీర్మానాలు కూడా ఆమోదించాయి. ఆయా తీర్మానాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో పంచాయతీ కమిషనర్ కార్యాలయానికి పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫైళ్లను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల విభజన/విలీన ప్రక్రియ వాయిదాకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. విభజన, విలీన ప్రక్రియపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే గ్రామీణ పరిపాలనలో మార్పులు, సిఫార్సుల అమలు, చట్టపరమైన సవరణలపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!