AP Government: కొత్త జిల్లాలకు.. కొత్త ఉన్నతాధికారుల నియామకం..
- 2 కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం..
- కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్ర ప్రదేశ్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఇప్పటి మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28 కి పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా మార్కాపురం మరియు పోలవరం అనే రెండు జిల్లాలను అధికారికంగా ఆమోదించింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న 5 రెవెన్యూ డివిజన్లను కలిపితే మొత్తం సంఖ్య 82 కి చేరుకున్నాయి.. ఇక, కొత్త జిల్లాలకు కొత్తగా ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం..
Read Also: Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఎ.ఎస్. దినేష్ కుమార్ను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ.ఎస్. దినేష్ కుమార్ ను పోలవరం జిల్లా ఇంఛార్జ్గా నియమించారు. ఇక, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ను నియమించారు.. ప్రస్తుతం అల్లూరి జిల్లా SPగా ఉన్న అమిత్ బర్దర్ను పోలవరం జిల్లా SP (ఇంఛార్జ్) గా నియమించారు. జాయింట్ కలెక్టర్గా తిరుమాని శ్రీ పూజను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా JC గా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా JC గా నియమించారు.
ఇక, మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా పీ. రాజాబాబును నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్న పీ. రాజాబాబు ను మార్కాపురం జిల్లా ఇంచార్జ్గా నియమించారు. మరోవైపు ఇంఛార్జ్ ఎస్పీగా వి. హర్షవర్థన్ రాజును ప్రకటించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా SPగా ఉన్న వి. హర్షవర్థన్ రాజును మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా నియమించారు. ఇక, జేసీగా రోనంకి గోపాల కృష్ణను నియమించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా JC గా ఉన్న రోనంకి గోపాల కృష్ణను మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ జేసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!