AP Government: కొత్త జిల్లాలకు.. కొత్త ఉన్నతాధికారుల నియామకం..
- 2 కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం..
- కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్ర ప్రదేశ్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఇప్పటి మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28 కి పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా మార్కాపురం మరియు పోలవరం అనే రెండు జిల్లాలను అధికారికంగా ఆమోదించింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న 5 రెవెన్యూ డివిజన్లను కలిపితే మొత్తం సంఖ్య 82 కి చేరుకున్నాయి.. ఇక, కొత్త జిల్లాలకు కొత్తగా ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం..
Read Also: Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
Also Read
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఎ.ఎస్. దినేష్ కుమార్ను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ.ఎస్. దినేష్ కుమార్ ను పోలవరం జిల్లా ఇంఛార్జ్గా నియమించారు. ఇక, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ను నియమించారు.. ప్రస్తుతం అల్లూరి జిల్లా SPగా ఉన్న అమిత్ బర్దర్ను పోలవరం జిల్లా SP (ఇంఛార్జ్) గా నియమించారు. జాయింట్ కలెక్టర్గా తిరుమాని శ్రీ పూజను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా JC గా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా JC గా నియమించారు.
ఇక, మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా పీ. రాజాబాబును నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్న పీ. రాజాబాబు ను మార్కాపురం జిల్లా ఇంచార్జ్గా నియమించారు. మరోవైపు ఇంఛార్జ్ ఎస్పీగా వి. హర్షవర్థన్ రాజును ప్రకటించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా SPగా ఉన్న వి. హర్షవర్థన్ రాజును మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా నియమించారు. ఇక, జేసీగా రోనంకి గోపాల కృష్ణను నియమించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా JC గా ఉన్న రోనంకి గోపాల కృష్ణను మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ జేసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు..
తాజావార్తలు
-
Trump: ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు దక్కనివ్వను.. ట్రంప్ శపథం
-
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
-
E20 Ethanol Demand: E20 తర్వాత అసలు సవాలు ఏంటి?.. ఆహారం, నీటిపై ఒత్తిడి తప్పదా?
-
Minister Ponguleti: 22A నుంచి 32 వేల భూములకు విముక్తి.. నిషేధిత భూములపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Voters List: తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల.. మీ ఓటు లేకపోతే ఇలా చేయండి..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!