AP Government: కొత్త జిల్లాలకు.. కొత్త ఉన్నతాధికారుల నియామకం..
- 2 కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం..
- కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్ర ప్రదేశ్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఇప్పటి మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28 కి పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా మార్కాపురం మరియు పోలవరం అనే రెండు జిల్లాలను అధికారికంగా ఆమోదించింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న 5 రెవెన్యూ డివిజన్లను కలిపితే మొత్తం సంఖ్య 82 కి చేరుకున్నాయి.. ఇక, కొత్త జిల్లాలకు కొత్తగా ఉన్నతాధికారులను నియమించింది ప్రభుత్వం..
Read Also: Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
Also Read
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఎ.ఎస్. దినేష్ కుమార్ను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎ.ఎస్. దినేష్ కుమార్ ను పోలవరం జిల్లా ఇంఛార్జ్గా నియమించారు. ఇక, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్ను నియమించారు.. ప్రస్తుతం అల్లూరి జిల్లా SPగా ఉన్న అమిత్ బర్దర్ను పోలవరం జిల్లా SP (ఇంఛార్జ్) గా నియమించారు. జాయింట్ కలెక్టర్గా తిరుమాని శ్రీ పూజను నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం అల్లూరి జిల్లా JC గా ఉన్న తిరుమాని శ్రీ పూజను పోలవరం జిల్లా JC గా నియమించారు.
ఇక, మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా పీ. రాజాబాబును నియమించింది ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్న పీ. రాజాబాబు ను మార్కాపురం జిల్లా ఇంచార్జ్గా నియమించారు. మరోవైపు ఇంఛార్జ్ ఎస్పీగా వి. హర్షవర్థన్ రాజును ప్రకటించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా SPగా ఉన్న వి. హర్షవర్థన్ రాజును మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా నియమించారు. ఇక, జేసీగా రోనంకి గోపాల కృష్ణను నియమించారు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా JC గా ఉన్న రోనంకి గోపాల కృష్ణను మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ జేసీగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు..
తాజావార్తలు
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?