Annadata Sukhibhava: గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. వారి ఖాతాల్లో జమకానున్న రూ.20 వేలు..!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్న్యూస్..
- కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం..
- ‘అన్నదాత సుఖీభవ’ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేలు..
- మూడు విడతల్లో రైతుల ఖాతాలో సొమ్ము జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది.. సొంతంగా భూమి ఉన్న రైతులే కాదు.. ఇతరుల పొలాలను కౌలు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతులకూ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఆ రూ.20 వేలను మూడు విడతల్లో రైతులను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని.. ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్…
Read Also: Terrorist: పోలీసుల నుంచి తప్పించుకోబోయిన లష్కరే తోయిబా స్లీపర్ సెల్.. చివరకు ఏమైందంటే..?
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు కలిగిన (ఆర్ఓఎఫ్ఆర్) వారిని అర్హులుగా గుర్తించనుంది ఏపీ ప్రభుత్వం.. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలోని సంబంధిత రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను.. ఈ నెల 20వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్గా ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది సర్కార్.. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించనున్నారు.. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకూ ఈ పథకం వర్తింపజేయబోతున్నారు.. అయితే, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు, గతంలో రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించినవారు.. ఇప్పుడు నిర్వహించే వారు కూడా అర్హులు కాదు. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారూ పథక ప్రయోజనాలు అందుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది..
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!