Amaravati Farmers: రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం.. రెండవ దశ భూ సమీకరణకు రైతుల అంగీకారం..!
- రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం..
- 29 గ్రామాల రైతుల సమస్యలు విన్న చంద్రబాబు..
- ఏకాభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రైతుల నిర్ణయం..
Amaravati Farmers: రాజధాని అమరావతి ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని చెప్పారు చంద్రబాబు.. త్రిసభ్య కమిటీ ప్రతినెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా విన్న చంద్రబాబు… రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు..
Read Also: Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
ఇక, ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయి.. కొంత మంది రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే.. ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత అందరి రైతులు ఏకాభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం అని ప్రకటించారు.. చంద్రబాబును చూసే భూములు ఇచ్చాం.. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం కలిగింది అన్నారు.. రెండవ దశ భూ సమీకరణకు.. మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని వెల్లడించారు.. కొంతమంది ఇక్కడ భూముల అభివృద్ధి చేయకుండా మళ్లీ భూ సమీకరణ ఏంటని మాట్లాడుతున్నారు… ఇక్కడ అభివృద్ధి చేస్తూనే… అక్కడ కూడా అభివృద్ధి విస్తరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత రైతులందరూ సంతృప్తిగా ఉన్నారని ప్రకటించారు అమరావతి రైతులు..
ఇక, నెల రోజుల లోపు గ్రామ కంఠాల సమస్యపై సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.. దీని కోసం కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి 29 గ్రామాల రైతులు హాజరయ్యారు.. ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, అసైన్డ్ భూములపై భేటీలో చర్చించారు.. మొత్తంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!