Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
- తెనాలి ప్రచురణలు భారత జ్యోతి పురస్కార ప్రదానం వేడుకల్లో వెంకయ్య కీలక వ్యాఖ్యలు..
- తెనాలి ప్రాంతం అంటే ఎంతో అభిమానం ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలు చేశాం..
- సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతున్న ప్రాంతం తెనాలి..
- సంస్కృతిని సంప్రదాయాల కోసం యువత గట్టిగా కృషి చేయాలి..
- తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది ..
- అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సమాజ పరిశీలనా శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారం అందుకున్నారు.
Read Also: Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పిడికె రావు సేవలను విని, ఆయన్ని కలవాలని, అవార్డు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అన్నారు.. తెనాలి ప్రాంతానికి ఎంతో అభిమానం, ఇక్కడి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం యువత బాధ్యత.. యువత గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇక్కడ కలిసిన దృష్టి అవార్డు ఇవ్వటం మాత్రమే కాదు, మానవత్వపు విలువలు కాపాడుకోవడం కూడా అన్నారు.. ఇక, అమ్మ భాషను మరచినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు.. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలుగు పరిపాలన చేపట్టమని సూచించాను.
ఇక, పిడికె రావు మనసు నిండా పేదవాడిపై ప్రేమ కలిగి ఉన్నాడు. అమెరికాలో వేల డాలర్లు సంపాదించి వాటన్నింటిని వదిలేసి, పేద ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అసాధారణ నిర్ణయం కామేశ్వరరావు ది అన్నారు వెంకయ్యనాయుడు.. మరోవైపు, ఉచిత పథకాలపై హాట్ కామెంట్స్ చేశారు వెంకయ్య.. ఉచితాలు ఇచ్చినప్పుడు, మనుషులు సోమరిపోతులుగా తయారవుతారు… ఉచిత విద్య, ఉపకరణాలు పేదవారికి మాత్రమే అందించాలి.. కానీ, చేపలు ఉచితంగా ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి అని సూచించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉచితాల ఆర్థిక భారాన్ని గమనించి, ఆలోచించాలని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!