Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
- తెనాలి ప్రచురణలు భారత జ్యోతి పురస్కార ప్రదానం వేడుకల్లో వెంకయ్య కీలక వ్యాఖ్యలు..
- తెనాలి ప్రాంతం అంటే ఎంతో అభిమానం ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలు చేశాం..
- సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతున్న ప్రాంతం తెనాలి..
- సంస్కృతిని సంప్రదాయాల కోసం యువత గట్టిగా కృషి చేయాలి..
- తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది ..
- అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సమాజ పరిశీలనా శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారం అందుకున్నారు.
Read Also: Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పిడికె రావు సేవలను విని, ఆయన్ని కలవాలని, అవార్డు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అన్నారు.. తెనాలి ప్రాంతానికి ఎంతో అభిమానం, ఇక్కడి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం యువత బాధ్యత.. యువత గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇక్కడ కలిసిన దృష్టి అవార్డు ఇవ్వటం మాత్రమే కాదు, మానవత్వపు విలువలు కాపాడుకోవడం కూడా అన్నారు.. ఇక, అమ్మ భాషను మరచినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు.. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలుగు పరిపాలన చేపట్టమని సూచించాను.
ఇక, పిడికె రావు మనసు నిండా పేదవాడిపై ప్రేమ కలిగి ఉన్నాడు. అమెరికాలో వేల డాలర్లు సంపాదించి వాటన్నింటిని వదిలేసి, పేద ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అసాధారణ నిర్ణయం కామేశ్వరరావు ది అన్నారు వెంకయ్యనాయుడు.. మరోవైపు, ఉచిత పథకాలపై హాట్ కామెంట్స్ చేశారు వెంకయ్య.. ఉచితాలు ఇచ్చినప్పుడు, మనుషులు సోమరిపోతులుగా తయారవుతారు… ఉచిత విద్య, ఉపకరణాలు పేదవారికి మాత్రమే అందించాలి.. కానీ, చేపలు ఉచితంగా ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి అని సూచించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉచితాల ఆర్థిక భారాన్ని గమనించి, ఆలోచించాలని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..
తాజావార్తలు
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!