Vadapally Brahmotsavalu: కోనసీమ తిరుమల వాడపల్లిలో రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో హడావిడి…. భక్తుల సందడి మామూలుగా వుండదు. అందునా తిరుమల బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతారు. తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి భక్తులకు ఎంతో ఇష్టమయిన ప్రాంతం. తిరుమలకు వెళ్ళలేని భక్తజనం ఇక్కడ స్వామివారిని దర్శించి తరిస్తారు.తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి.
గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ప్రశాంతత చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కోనసీమ తిరుమల వాడపల్లి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఈ నెల 14 నుంచి 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
Read Also: Sankastha Hara Chaturdhi Bhakthi Tv Live: సంకష్ట హర చతుర్థి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలు, ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు దేవాదాయ శాఖ అధికారులు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇవి చూడముచ్చటగా వున్నాయి. సుమారు రూ.70 లక్షల వ్యయంతో తొమ్మిది రోజుల పాటు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. వివిధ వాహనాల్లో మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు స్వామివారు.
సాధారణంగా ఏటా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడు శనివారాల నోము నోచుకున్న భక్తులతో కిటకిటలాడుతుంటుంది. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతూ వుంటుంది. అక్టోబర్ మాసంలో బ్రహ్మోత్సవాల కు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోనూ ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడి గ్రామస్తులు బ్రహ్మోత్సవాలు, తిరునాళ్ళకు రోజూ అన్నసంతర్పణ చేస్తుంటారు. వాడపల్లిలో మార్చినెలలో జరిగే తిరునాళ్ళ ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండి అంటే మావద్దకురండి అని పిలుస్తూ వుంటారు.
Read Also: Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!