Site icon NTV Telugu

Adulterated Ghee: రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ..

Ghee

Ghee

Adulterated Ghee: రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10.30 గంటల నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది MLAలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ రోజు సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో రేపు సభకు వచ్చిన తరువాత కల్తీ నెయ్యిపై డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

Read Also: Bharat Taxi: గుడ్‌న్యూస్.. భారత్ టాక్సీ యాప్‌ను ఆవిష్కరించిన అమిత్ షా

అలాగే, టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇక నుంచి ఆ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తుంది.

Read Also: Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..

ఇక, అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. అలాంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version