Extramarital Affair: మరో యువకుడితో బెడ్రూమ్లో భార్య.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Young Man Got Killed Becuase Of Extramarital Affair in Anantapur: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన జీవతాన్ని సర్వనాశనం చేసుకుంది. ఓ యువకుడి హత్యకు కూడా కారణమైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీళ్లు గుంతకల్లులోని చైతన్య థియేటర్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్వామినాయక్ డ్రైవర్ కావడంతో.. వృతి రీత్యా ఎక్కువ రోజులు హైదరాబాద్లోనే ఉంటాడు. కుటుంబ పోషణకు డబ్బు పంపించేవాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి, తిరిగి హైదరాబాద్ వెళ్లేవాడు. స్వామినాయక్ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి.. ఇంటి పనుల కోసం స్వామినాయక్ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్ తరచూ మంగమ్మ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడు.. వీళ్లు ఏకాంతంగా సమయం గడిపేవారు.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
బుధవారం కూడా పిల్లలు స్కూల్కు వెళ్లిన తర్వాత.. మంగమ్మ ఇంటికి సుంకేనాయక్ వచ్చాడు. అయితే.. అదే సమయంలో స్వామినాయక్ కూడా ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బెడ్రూమ్లో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం గమనించాడు. దాంతో కోపాద్రిక్తుడైన స్వామినాయక్, వెంటనే కత్తితో సుంకేనాయక్పై దాడి చేశాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. భర్తని అడ్డుకోవడానికి భార్య మంగమ్మ ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడి చేశాడు. తలపై గట్టిగా బాదాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుంకేనాయక్ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మంగమ్మని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!