Vijayawada Crime: నిద్రపోతున్న భర్త.. వేడినీళ్లు పోసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి చాలా కారణాలున్నాయి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అదనపు కట్నం కోసం వేధించారని, ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెబుతూ ఉంటే అనేక కారణాలు ఉన్నాయి. గొడవల కారణంలో పరిస్థితులు రానురాను సంప్రదాయాలను కూడా మరిచిపోయేలా చేస్తున్నాయి. ఎక్కడా అనుబంధానికి, అనురాగాలకు తావు లేదు. తప్పుడు మార్గాల్లో వెళ్లాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. భారమైన జీవితాలు మనిషి యొక్క సహజ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రెప్పపాటులో తప్పులు చేస్తూ దాని పర్యవసానాల గురించి ఆలోచించలేకపోతున్నారు. అనేక విషయాల్లో పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఎదుటి వారిపై ఆకోపాల్ని చూపిస్తూ పచ్చిని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి ఒత్తిడిలో మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. ఎవరి ప్రాణం తమదే అన్నట్లు జీవిస్తున్నారు. కానీ ధైర్యమైన నిర్ణయం తీసుకోలేని వాళ్లకి ఇదంతా జరుగుతుంది, ఓపిక ఉన్నంత వరకు భరించి, చివరకు ఒకరోజు కోపంతో రగిలిపోతూ తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇది వారి జీవితాలను సమూలంగా మారుస్తుంది. ఈ మార్పు తర్వాత వారికి మరో జీవితం ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది. భర్తపై కోపంతో వేడి నీళ్లు పోసింది.
Read also: Jobs: యువతకు శుభవార్త.. ఈ రంగంలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
విజయవాడ లో దుర్గారావు,భార్య శ్రావణి వన్ టౌన్ చిట్టి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే సజావుగా సాగిన వీరి జీవితంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. అయితే నిన్న భార్యభర్తల మధ్య గొడవ మళ్ళీ మొదలైంది. కోపంలో ఒకరినొకరు మాటల యుద్ధం జరిగింది. భార్యతో గొడవ అనంతరం భర్త నిద్ర పోయాడు. అయితే.. భర్తపై భార్య శ్రావణి కోపం పెంచుకుంది. తనతో గొడవ పడిన భర్త ప్రశాంతంగా పడుకోవడం సహించలేకపోయింది. స్టవ్ పై నీళ్లు పెట్టింది. నీటిని బాగా మరిగించింది. ఆ నీటిని తీసుకుని వచ్చి నిద్రిస్తున్న భర్తపై పోసింది. దీంతో భర్త ఒక్క అరుపుతో లేచి కూర్చున్నాడు. ఏమైంది ఎందుకు నాపై వేడి నీటిని పోసావువంటూ భార్యపై మండిపడ్డాడు. ఒళ్లంతా మంటగా ఉందంటూ విలవిల లాడాడు. దుర్గారావు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న బంధువులు దుర్గారావును ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు దుర్గారావు భార్యపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP: దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్ గురించి మాట్లాడడం సమయం వృథా..!
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!