Vijayawada Crime: నిద్రపోతున్న భర్త.. వేడినీళ్లు పోసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి చాలా కారణాలున్నాయి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అదనపు కట్నం కోసం వేధించారని, ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెబుతూ ఉంటే అనేక కారణాలు ఉన్నాయి. గొడవల కారణంలో పరిస్థితులు రానురాను సంప్రదాయాలను కూడా మరిచిపోయేలా చేస్తున్నాయి. ఎక్కడా అనుబంధానికి, అనురాగాలకు తావు లేదు. తప్పుడు మార్గాల్లో వెళ్లాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. భారమైన జీవితాలు మనిషి యొక్క సహజ సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రెప్పపాటులో తప్పులు చేస్తూ దాని పర్యవసానాల గురించి ఆలోచించలేకపోతున్నారు. అనేక విషయాల్లో పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఎదుటి వారిపై ఆకోపాల్ని చూపిస్తూ పచ్చిని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి ఒత్తిడిలో మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. ఎవరి ప్రాణం తమదే అన్నట్లు జీవిస్తున్నారు. కానీ ధైర్యమైన నిర్ణయం తీసుకోలేని వాళ్లకి ఇదంతా జరుగుతుంది, ఓపిక ఉన్నంత వరకు భరించి, చివరకు ఒకరోజు కోపంతో రగిలిపోతూ తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇది వారి జీవితాలను సమూలంగా మారుస్తుంది. ఈ మార్పు తర్వాత వారికి మరో జీవితం ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది. భర్తపై కోపంతో వేడి నీళ్లు పోసింది.
Read also: Jobs: యువతకు శుభవార్త.. ఈ రంగంలో 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
విజయవాడ లో దుర్గారావు,భార్య శ్రావణి వన్ టౌన్ చిట్టి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే సజావుగా సాగిన వీరి జీవితంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. అయితే నిన్న భార్యభర్తల మధ్య గొడవ మళ్ళీ మొదలైంది. కోపంలో ఒకరినొకరు మాటల యుద్ధం జరిగింది. భార్యతో గొడవ అనంతరం భర్త నిద్ర పోయాడు. అయితే.. భర్తపై భార్య శ్రావణి కోపం పెంచుకుంది. తనతో గొడవ పడిన భర్త ప్రశాంతంగా పడుకోవడం సహించలేకపోయింది. స్టవ్ పై నీళ్లు పెట్టింది. నీటిని బాగా మరిగించింది. ఆ నీటిని తీసుకుని వచ్చి నిద్రిస్తున్న భర్తపై పోసింది. దీంతో భర్త ఒక్క అరుపుతో లేచి కూర్చున్నాడు. ఏమైంది ఎందుకు నాపై వేడి నీటిని పోసావువంటూ భార్యపై మండిపడ్డాడు. ఒళ్లంతా మంటగా ఉందంటూ విలవిల లాడాడు. దుర్గారావు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికి చేరుకున్న బంధువులు దుర్గారావును ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు దుర్గారావు భార్యపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
YSRCP: దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్ గురించి మాట్లాడడం సమయం వృథా..!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!