గందరగోళంగా దర్శి నగర ‘పంచాయతీ‘
ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు.
8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో తండ్రి తన నామినేషన్ ని ఉపసంహరించు కున్నారు. అయితే తన కుమారుని ఉపసంహరణ పత్రాలు కూడా తానే సమర్పించాడని ఎన్నికల అధికారి తెలపడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 8వ వార్డు అభ్యర్థి శ్రీనును మధ్యాహ్నం వెంట బెట్టుకొని ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జి నూకసాని బాలాజీ అక్కడికి వచ్చారు. ఎన్నికల అధికారికి 8వ వార్డు అభ్యర్థి తరపున టీడీపీ బి ఫామ్ ఇచ్చి ఎకనాలెడ్జ్ మెంట్ కాగితాన్ని తీసుకున్నారు.
సాయంత్రం ఏడుగంటల సమయంలో టీడీపీ అభ్యర్థి ఉపసంహరణ పత్రాలు మధ్యాహ్నం సమర్పించారని ఎన్నికల అధికారి తెలపడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్,మార్కాపురం,దర్శి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి,నారపుశెట్టి పాపారావు,దర్శి నియోజకవర్గ ఇంచార్జి పమిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Lady Super Star : రూటు మార్చిన లేడి సూపర్ స్టార్ ఒక వైపు సీనియర్.. మరో వైపు జూనియర్ హీరోలతో బిజీ
-
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
-
Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
-
Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
-
CSK Injury Update: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!