World Elephant Day: అంతరించిపోతున్న గజరాజులు… మనిషే అసలు శత్రువా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి మీద ఉండే అతి పెద్ద క్షీరదాలు ఏనుగులు. వాటితో మనుషులకు చాలా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మన చిన్నతనం నుంచే ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు అంటూ ఆడుకుంటూ ఉంటాం. కేవలం మనుషుల విషయంలోనే కాదు దేవుళ్లకు కూడా ఏనుగులతో మంచి బంధం ఉంది. దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం. మన పురాణాలలో సైతం ఏనుగుల జాతి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రధమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే. అంతటి ప్రాసస్త్యాం కలిగిన గజరాజుల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏనుగుల జాతి అంతరించే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆ విషయాలను తెలుసుకుందాం.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం చరిత్ర
ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏటా ఆగష్టు 12వ తేదీ నిర్వహిస్తారు.2011లో కనజ్వెస్ట్ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు చెందిన కెనడియన్ సినీ నిర్మాతలు ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్లాండ్ సంస్థ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరనంద సంయుక్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 2012లో సిమ్స్తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా మొదటిసారి ‘వరల్డ్ ఎలిఫెంట్ డే’ ను నిర్వహించింది. ఆ సదస్సులో ఆసియా, ఆఫ్రికా జాతి ఏనుగులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించడం జరిగింది. మన పర్యావరణంలో ఏనుగుల పాత్ర ఎంతగొప్పదో ఈ సందర్భంగా చర్చిస్తారు. అంతేకాకుండా గజరాజులను ఎలా సంరక్షించుకోవాలి, తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు, ఆ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారు వివరిస్తారు.
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
ఏనుగులకు మనిషే శత్రువులా ఎలా మారుతున్నాడు?
వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం ఏనుగులను బంధించే సంస్కృతి మన దేశంలో ఉంది. ఆచారం పేరుతో జరిగే ఈ చర్యలన్నీ కూడా వాటి స్వేచ్ఛను హరించేవే. ఏనుగు దంతాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, హింసించి దాని దంతాలను బలవంతంగా పీకి వాటితో దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు మనిషి. వాటికి సొంతమైన అడవి భూమిని పంటల పేరుతో ఆక్రమించి, వాటి మనుగడకు అవసరమైన నీటి కుంటలను పూడ్చేస్తూ వాటితో చెలగాటమాడుతున్నాడు. పొలాల్లోకి రాకుండా వాటి చుట్టూ కంచె వేసి కరెంట్ షాక్ పెడుతున్నారు. వీటి కారణంగా బలైన మూగ ప్రాణాలు ఎన్నో. అంతేకాకండా జనావాసాల్లోకి తప్పిన పోయిన వచ్చిన వాటిపై కరుణ చూపకుండా కొట్టి చంపిన ఉదంతాలు అనేకం. ఏదీ ఏమైనా మనిషి ఇలాగే ప్రవర్తిస్తే అంతరించి పోయిన జీవజాతుల్లో ఏనుగులు కలవడం ఖాయం. అందుకే వాటి రక్షణకు ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న చర్యలకు అదనంగా మరిన్ని చర్యలు చేపట్టడం అవసరం.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?