EMIs High-No Extension: రుణం.. భారం. రెపో రేటు పెంపు ఫలితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్ని పెంచుకునేవారు.
కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని నిపుణులు అంటున్నారు. గతంలో నాలుగు సార్లు రెపో రేటు పెరిగినప్పుడు లోన్ రీపేమెంట్ టైమ్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నవాళ్లు ఇప్పుడు కూడా మరోసారి పొడిగింపు కోరుకుంటే దానివల్ల లోన్పై నెగెటివ్ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంటే.. మంత్లీ ఇంట్రస్ట్ పేమెంట్ అనేది ఈఎంఐ పరిధిలోకి రాదు. ఫలితంగా.. నెల నెలా ఈఎంఐలు కడుతున్నప్పటికీ ప్రిన్స్పల్ అమౌంట్ మాత్రం పెరుగుతూ పోతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read also: Small Loans-Better Payments: తిరిగివ్వటంలో.. తనదైన ‘‘ముద్ర’’
ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా హోం లోన్ తీసుకున్నవారిపై లేటెస్ట్ రెపో రేటు పెంపు ప్రభావం తీవ్రంగా పడుతుంది. గతంలోని నాలుగు సార్లుతో పోల్చితే తాజాగా పెరిగిన రెపో రేటు తక్కువే అయినప్పటికీ ఈ వాస్తవ పరిస్థితిని తలచుకొని గృహ రుణగ్రహీతలు ప్రస్తుతం షాక్కు గురవుతున్నారు. హోం లోన్కి చెల్లించాల్సిన నెలవారీ వాయిదా మరో 3 నుంచి 5 శాతం పెరుగుతుందని ఇండియా మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ శ్రీవాస్తవ చెప్పారు.
నాలుగు సార్లు కలిపి రెపో రేటు 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో గతంలో లోన్ రీపేమెంట్ పీరియెడ్ను 20 ఏళ్లుగా నిర్దేశించుకున్నవాళ్లు దాదాపు మరో 13 ఏళ్లపాటు ఈఎంఐలు చెల్లిస్తూ పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇల్లు కొనేటప్పుడు 6 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకున్నవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణాన్ని తిరిగి చెల్లించే గడువును పెంచుకోకుండా ఈఎంఐ అమౌంట్ను పెంచుకున్నవారిపై సుమారు 20 శాతం అదనపు భారం పడుతోందని శ్రీవాస్తవ వివరించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!