EMIs High-No Extension: రుణం.. భారం. రెపో రేటు పెంపు ఫలితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్ని పెంచుకునేవారు.
కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని నిపుణులు అంటున్నారు. గతంలో నాలుగు సార్లు రెపో రేటు పెరిగినప్పుడు లోన్ రీపేమెంట్ టైమ్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నవాళ్లు ఇప్పుడు కూడా మరోసారి పొడిగింపు కోరుకుంటే దానివల్ల లోన్పై నెగెటివ్ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంటే.. మంత్లీ ఇంట్రస్ట్ పేమెంట్ అనేది ఈఎంఐ పరిధిలోకి రాదు. ఫలితంగా.. నెల నెలా ఈఎంఐలు కడుతున్నప్పటికీ ప్రిన్స్పల్ అమౌంట్ మాత్రం పెరుగుతూ పోతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read also: Small Loans-Better Payments: తిరిగివ్వటంలో.. తనదైన ‘‘ముద్ర’’
ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా హోం లోన్ తీసుకున్నవారిపై లేటెస్ట్ రెపో రేటు పెంపు ప్రభావం తీవ్రంగా పడుతుంది. గతంలోని నాలుగు సార్లుతో పోల్చితే తాజాగా పెరిగిన రెపో రేటు తక్కువే అయినప్పటికీ ఈ వాస్తవ పరిస్థితిని తలచుకొని గృహ రుణగ్రహీతలు ప్రస్తుతం షాక్కు గురవుతున్నారు. హోం లోన్కి చెల్లించాల్సిన నెలవారీ వాయిదా మరో 3 నుంచి 5 శాతం పెరుగుతుందని ఇండియా మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ శ్రీవాస్తవ చెప్పారు.
నాలుగు సార్లు కలిపి రెపో రేటు 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో గతంలో లోన్ రీపేమెంట్ పీరియెడ్ను 20 ఏళ్లుగా నిర్దేశించుకున్నవాళ్లు దాదాపు మరో 13 ఏళ్లపాటు ఈఎంఐలు చెల్లిస్తూ పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇల్లు కొనేటప్పుడు 6 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకున్నవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణాన్ని తిరిగి చెల్లించే గడువును పెంచుకోకుండా ఈఎంఐ అమౌంట్ను పెంచుకున్నవారిపై సుమారు 20 శాతం అదనపు భారం పడుతోందని శ్రీవాస్తవ వివరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
-
BMW X1 LWB: భారత్లో BMW X1 LWB విడుదల.. మొదటిసారి లగ్జరీ కారు కొనేవారిపై BMW కన్ను
-
Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?