Site icon NTV Telugu

ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్ లో కానరాని కోవిడ్ నిబంధనలు…

ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్ లో కోవిడ్ నిబంధనలు ఎక్కడ కానరావడం లేదు. కరోనా టెస్ట్ లు చేయించుకున్న తరువాత నేరుగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి వెళ్తున్నారు. దాని రిజల్ట్స్ రాకుండానే బయట తిరుగుతున్నారు ప్రజలు.  బస్ స్టేషన్లో కనీసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. బస్సులో కూడా మాస్క్ లు పెట్టుకోకుండా నే ప్రయాణిస్తునన్నారు ప్రజలు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం ఏపీలో రోజుకు 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Exit mobile version