హుజురాబాద్ లో క్యాడర్ మెత్తం పార్టీతోనే ఉంది : గంగుల కమలాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుంది. తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుంది. అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదని, ప్రజల్లో కేసీఆర్ గారి అచంచల విశ్వాసం వ్యక్తమవుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి మాట్లాడారు, వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ గారి పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల విజయాలే తార్కాణమన్నారు.
హుజురాబాద్లో టీఆర్ఎస్ భలంగా ఉందని, వ్యక్తులు పోయినంత మాత్రానా టీఆర్ఎస్కి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్నే ప్రజలు ఆదరిస్తున్నారని, కేసీఆర్ పోటోనే మా గెలుపు మంత్రమన్నారు. మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70శాతం తెలంగాణ ప్రజల విశ్వాసంతో ఘన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే నిరూపితమయిందన్నారు.సాగర్లో జానారెడ్డే గెలుస్తాడని అందరూ చెప్పినా..టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం కేసీఆర్ పోటోతో భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు మంత్రి గంగుల. కేసీఆర్ వెంటే పార్టీ మెత్తం ఉందని, ఎన్నికలేవైనా కేసీఆర్ పోటోనే మా గెలుపుమంత్రమన్నారు. కరీంనగర్లో తాను గెలిచినా, హుజురాబాద్లో ఈటెల గెలిచినా అది కేవలం కేసీఆర్ గారి వల్లే సాద్యమయిందన్నారు. ప్రజలకు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలే గెలుపు బాటలు వేస్తున్నాయని, కల్లాల్లో పండుతున్న పంటల్లో, కాల్వల్లో పారుతున్న నీళ్లల్లో కేసీఆర్ గారిని ప్రజలు చూస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, రైతు బందు, రైతు బీమల్లో కేసీఆర్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని పార్టే ముఖ్యమన్నారు గంగుల.
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
హుజురాబాద్లో ఈటెల వల్ల ఎలాంటి నష్టం లేదని, క్యాడర్లో ఎవరికీ అనుమానాలు లేవని, అందరూ పూర్తిగా దీమాతో ఉన్నారు. పూర్తిగా పార్టీతో, టీఆర్ఎస్తోనే వారు ఎప్పుడూ ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ స్థానికంగా చాలా భలంగా ఉందని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు మంత్రి గంగుల. హుజురాబాద్లో పార్టీ క్యాడర్కి అండగా ఉంటామని, వారికి నిరంతంర అంధుబాటులో ఉంటామని, భవిష్యత్లో పార్టీ తీసుకొనే నిర్ణయానికి పూర్తిగా అందరం కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈటెల వ్యవహారంలో పార్టీ త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, పుట్ట మదు వ్వవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని, హైకోర్టులో వామన్ రావు గారి తండ్రి పిర్యాదు మేరకు చట్టం తన పని తాను చేస్తుందని, జరుగుతున్న వ్యవహారాల్లో పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని మరోసారి పునరుద్ఘాటించారు. ఎన్నికలేవైనా ఇంతలా ఆధరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి మంత్రి గంగుల ధన్యవాదాలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!