Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Migrant Workers Rush To Railway Stations In All States

మళ్ళీ ఇళ్ల బాట పట్టిన వలస కూలీలు ?

Published Date :April 14, 2021 , 8:56 pm
By Premchand Chowdary
మళ్ళీ ఇళ్ల బాట పట్టిన వలస కూలీలు ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కూటి కోసం.. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వలస వచ్చిన కూలి జనాలకు.. పీడకల లాంటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కరోనా దెబ్బకు గతేడాది లాక్ డౌన్ సమయంలో చిందరవందరైన  జీవితం, వారు పడిన కష్టం ఎవరూ మర్చిపోలేదు.  సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో పలు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ దిశగా సాగుతుండటంతో…వలస జీవులకు మళ్లీ కష్టాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మహారాష్ట్ర సహా తెలుగు రాష్ట్రాల నుంచి తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్ల బాట పడుతున్నారు.  పని చేసే చోట పనులు నిలిచిపోతున్నాయి. 

చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోతోంది.  రెండోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేవని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా కూడా వారిని అనుమానాలు వేధిస్తున్నాయి. ఉరుములేని పిడుగులా ఎప్పుడైనా లాక్ డౌన్ ప్రకటించవచ్చని, భావిస్తున్నారు కార్మికులు. మళ్లీ రాకపోకలు పై నిషేధాజ్ఞలు పెడతారన్న భయంతో కూలి జనం సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే దాదాపు దేశంలో సగం రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు అమలులోకి వస్తున్నాయి. మిగతా చోట్ల ఆంక్షలు కఠినం గా ఉంటున్నాయి. 

Also Read

  • Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
  • Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
  • house collapses due to blast: భారీ పేలుడు.. ఇల్లు కూలి ఆరుగురు మృతి
  • Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు

 ఈ తరుణంలో దేశం మొత్తానికి తాళం పడే రోజు దగ్గర్లోనే ఉందనే అనుమానాలు వలస కార్మికుల్లో ఎక్కువయ్యాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ముందస్తుగా సొంతూళ్లకు వెళ్లడం మేలని డిసైడ్ అయ్యారు కార్మికులు.  దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. గత ఏడాది ఇదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా కూలిజనం నానా కష్టాలు పడ్డారు. ఇటు పని దొరక్క…అటు సొంతూళ్లకు వెళ్లలేక తిండీ తిప్పలు లేక పస్తులతో అలమటించారు.  లక్షలాదిమంది కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. మార్గమధ్యలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

 లేదంటే అవస్ధలు తప్పవన్నది వారి భయం.  స్వస్థలాలకు వెళ్లిపోతే ఐనవారితో ఉండి.. ఉన్నది కాస్తా తిని కడుపు నింపుకోవచ్చని ఆవేదనతో చెబుతున్నారు కార్మికులు. సెకెండ్‌ వేవ్‌ రూపంలో  ఇప్పటికే ఉపద్రవం ముంచుకొస్తోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర లాంటి చోట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కరోజే వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. దీంతో మహారాష్ట్ర లాక్‌డౌన్‌ దిశగా వెళ్తోంది. ఇప్పటికే జనతా కర్ఫ్యూ పెట్టారు. ఆంక్షల్ని అక్కడి ప్రభుత్వం తీవ్ర చేసింది. అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.  కఠిన ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే సొంతూళ్లకు వెళ్లిపోవడం మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు వలస కూలీలు. గతేడాది బాధలను గుర్తుకు తెచ్చుకుంటూ పయనమవుతున్నారు. 

గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఇప్పటికే పలువురు వలస కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని పుణె లో పనిచేస్తున్న దాదాపు సగం మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పట్టారు.  సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులతో ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ బస్‌ టెర్మినల్‌, అహ్మదాబాద్‌లోని కలుపూర్‌ రైల్వే స్టేషన్‌, ముంబై, సూరత్‌లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. యూపీ, బీహార్‌కు వెళ్లే అన్ని రైళ్లు కిటకిటలాడుతున్నాయి.  వలసకూలీల కోసం మూడు ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నట్టు సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్ల సంఖ్య కూడా పెంచుతున్నట్లు తెలిపింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Migrant Workers
  • Rush to Railway Stations
  • states

తాజావార్తలు

  • Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!

  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!

  • Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions