‘మా’ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఉదయం ‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు. దీంతో పోలింగ్ కాసేపు ఆగిపోయింది. తరువాత అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బృందాలని పిలిపించిన ఎన్నికల అధికారి చర్చలు జరిపారు.
Read Also : మా ఎన్నికలు.. లోపల బీభత్సం.. కురుక్షేత్రం జరుగుతోంది..!
Also Read
రెండు ప్యానళ్ల సభ్యులతో చర్చించిన అనంతరం ఎన్నికల అధికారి రిగ్గింగ్ జరిగినట్లు తేలితే ఫలితాలు ప్రకటించబోనని వెల్లడించారు. అవసరం అనుకుంటే మా ఎన్నికలపై కోర్టుకు కూడా వెళతామని ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నామని, రిగ్గింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిగ్గింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలింగ్ సిబ్బంది పట్టుకున్నారు. సభ్యుడు కాని వ్యక్తి లోపలికి రావడంతో నరేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతన్ని వెంబడించి పట్టుకున్న విష్ణు ప్యానల్ సభ్యులు విష్ణు వదిలేయమని చెప్పడంతో వదిలేశారు.
తాజావార్తలు
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!