NTV Telugu Site icon

కాప్రా లైఫ్ లైన్ ఆసుపత్రి అరాచకం… డబ్బులు చెల్లిస్తే కానీ..?

మేడ్చల్ జిల్లా కప్రాలో  కరోనా తో చనిపోయిన మృతదేహానికి డబ్బులు కట్టే వరకు మృతదేహం ఇచ్చేది లేదని కాప్రా  లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్య  ఆ పేద కుటుంబ సభ్యులను వేధిస్తుంది,  ఈ ప్రయివేటు ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిన సంఘటన కాప్ర లోని పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్యం.శవాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పట్టించుకోని ఆసుపత్రి యాజమాన్యం,ఇప్పటికే సుమారు లక్ష నర చెల్లిచినా ఇంకా 2 లక్షలు చెల్లించి మృత దేహాన్ని తీసుకెళ్లాలని మొండి కేసిన యాజమాన్యము  కుటుంబ సభ్యుల ఆందోళన తో ఉన్నారు.మృతుడు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ లోని   రాంపల్లి కి చెందిన టీఆరెస్ పార్టీ నాయకుడు నిరుడు వాసు గత 5 రోజుల క్రితం కరోన వైరస్ తో బాధపడుతూ కాప్రా లోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో చేరాడు. మున్సిపల్ వాసులు అందరు తరలి వస్తున్నారు కొద్ది సేపట్లో ఆసుపత్రి వద్ద ధర్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.