కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ హాస్పిటల్, బెడ్స్,కోవిడ్ కేర్ సెంటర్స్, అంబులెన్స్ సర్వీస్ లు,హోమ్ ఐసోలేషన్,హోమ్ కోరoటైన్,కోవిడ్ వ్యాక్షినేషన్ సెంటర్స్ సమాచారం కొరకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణ కొరకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. 10 జిల్లాలకు ఐఏఎస్ అధికారులు, 3 జిల్లాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం…. జిల్లాలో 104 కాల్ సెంటర్ నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకుంటుంది. కరోనా రోగులు 104 కాల్ సెంటర్ కు కాల్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.