Site icon NTV Telugu

రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిళ పర్యటన

రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుండి షర్మిల బయలుదేరనున్నారు. కాగా దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పుట్టినరోజు అయిన జులై 8న పార్టీని పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version