Site icon NTV Telugu

Crazy News : ఆ దేశ జనాభా మొత్తం 27 మందేనట..!

Sealand

Sealand

కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్య కలుగుతుంది. అలాంటి విషయమే ఇది.. ఏ దేశమైన సుమారు కోట్లల్లో జనాభా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే ఈ దేశంలో మొత్తం 27 మంది మాత్రమే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. దేశాలను ఎవ్వరూ ఎప్పుడు నిర్మించలేదు.. అయితే.. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. ఈ దేశాన్ని పూర్తిగా మానవులు నిర్మించినదే.. సీలాండ్‌ అనే పేరు గల ఈ వింతదేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని సఫోక్‌ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై దేశాన్ని నిర్మించారు. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం ఈ దేశ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

సీలాండ్‌ దేశం 1967 సెప్టెంబర్‌ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను ఏర్పాటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత.. ఈ కోటకు జాక్‌ మూరే, అతని కూతురు జేన్‌ చేరుకున్నారు. వాళ్లిద్దరూ వండర్‌ఫుల్‌ రేడియో లండన్‌ అనే పైరేట్‌ రేడియో స్టేషన్‌ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్‌ రేడియో స్టేషన్‌ అధినేత ప్యాడీ రాయ్‌ బేట్స్‌ 1967 సెప్టెంబర్‌ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా.. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉండటం విశేషం.

 

Exit mobile version