వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. నిజానికి వివాదాలతోనే ఆయన సినిమాలకు హైప్ క్రియేట్ చేసి పబ్లిసిటీని పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ.
Read Also : పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్
తాజాగా “నాకెందుకో కేసిఆర్ కు ఈటెల రాజేందర్ వెన్నుపోటు, అలాగే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు సేమ్ అన్పించింది. అందుకే ఈ ఈటెల రాజేందర్ వెన్నుపోటు పొడిచిన విధానంపై రాజకీయ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నా. ఈ సినిమా పేరు వెన్నుపోటు ఈటలు” అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ తన పేరుతో ఫేక్ ప్రచారం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రాజకీయపరంగా ఈటెల, కేసిఆర్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
FAKE FAKE FAKE pic.twitter.com/icQBPUyKM8
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021