Viral: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్ టచ్ కూడా ఉందట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెంపుడు జంతువులను ఎంతో ప్రేమ చేస్తారు.. పొరపాటును అవి తప్పిపోతే వాటి యజమానులు చేసే హడావుడి చాలా సార్లు చూశాం.. ఏకంగా మీడియాకు ఎక్కి, నా పిల్లి పోయింది, నా కుక్కపోయింది.. ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తాం అని ప్రకటించినవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపై ఉన్న అభిమానాన్ని ఓ రేంజ్లో సెలబ్రేట్ చేశాడు.. అయితే, ఆ కథకు పొలిటికల్ టచ్ కూడా ఉండడంతో.. ఊరు ఊరంతా పిలిచాడు.. 100 కిలోల కేట్ కట్ చేశాడు.. చుక్క (లిక్కర్) లేదు కానీ.. ముక్క (మటన్)తో మంచి భోజనం వడ్డించాడు.. అతిథులు కేక్ తిని, భోజనాలు చేసి.. ఆ కుక్కుకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: COVID 19 Update: బుసలు కొడుతోన్న కరోనా.. తెలంగాణలో 500కు చేరువగా కేసులు
Also Read
- Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
- Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
- మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
- MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
కర్ణాటకలో జరిగిన కుక్క బర్త్డే పార్టీ, దాని వెనుక పొలిటికల్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివప్పబెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి… ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.. దానికి ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు.. క్రిష్ బర్త్ డే వేడుకలను గ్రాండ్గా నిర్వహించాడు.. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు.. శునకం పుట్టినరోజు వేడుకల్లో వంద కిలోల కేక్ కట్ చేయడమే కాదు.. 300 కిలోల మటన్, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు.. నాజ్ వెజ్ ప్రియులకు నాన్వెజ్… వెజ్ తినేవారి కోసం ప్రత్యేకంగా కూరగాయలను తెప్పించి భోజన ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు.. గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్పై శివప్ప మర్డికి ప్రేమ ఉన్నా.. పార్టీ వెనుక మాత్రం.. చిన్న పొలిటికల్ టచ్ ఉంది.. అదేంటి అంటే.. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు.. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట.. ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని కించపర్చే వ్యాఖ్యలు చేశాడట.. ఆ మాటలతో నొచ్చుకున్న శిప్ప మర్డి.. తన పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించి.. ఐదు వేల మందిని పిలిచి భోజనాలు పెట్టి ఔరా! అనిపించారు.. మొత్తంగా ఈ న్యూస్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
-
Raviteja : రవితేజ కెరీర్కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?