NTV Telugu Site icon

వండర్‌ వరాహం.. ఇదివేసిన పెయింటింగ్స్‌ ధరలు లక్షల్లో..

pigcasso paintings

మనకు మామూలుగా పెయింటింగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది పికాసో. ఎందుకంటే పెయింటింగ్స్‌లో ఆయన అంత ప్రావీణ్యం కలవాడు కాబట్టి. అయితే పందుల్లో కూడా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఓ పంది ఉంది. దానిపేరే పిగ్‌కాసో. సౌతాఫ్రికాలో ఉంటున్న ఈ పందిని చిన్నప్పుడే తన యజమాని ఓ మటన్‌ షాపుకు అమ్మేశాడు. అయితే ఆ మటన్‌షాపు యజమాని దీనిని వధించి వంటకు వాడాలనుకున్నాడు. కానీ.. అంతలోనే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేఫ్‌ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్‌సన్‌ అనే మహిళ స్థానికంగా ఫాం ఓ నిర్వహిస్తోంది.

ఆ ఫాంలో వివిధ ప్రమాదాల నుంచి రక్షించబడిన జంతువులను పోషిస్తుంటుంది. అయితే జువానే లెఫ్‌సన్‌ ఆ పందిని రక్షించి తన ఫాంకు తీసుకువచ్చింది. ఈ పంది ఓసారి నోట్లో బ్రెష్‌ పెట్టుకొని విన్యాసాలు చేస్తుండగా చూసిన జువానేకు ఓ ఆలోచన వచ్చింది. దీని ముందు వైట్‌ కాన్వాసు పెడితే ఎలా ఉంటుంది ఏం చేస్తుందని.. అయితే ఆమె ఆలోచనతో ఆ పంది నోట్లో ఓ బ్రెష్‌ పెట్టి కాన్వాసు ముందు నిలబెట్టింది. ఇంకేముందు ఈ వరాహం.. వడివడిగా పెయింటింగ్‌ వేసేసరికి జువేనా ఒక్కింత ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనైంది.

అయితే ఈ పంది పెయింటింగ్‌లను జువానే ఆన్‌లైన్‌ పెట్టడంతో జంతు ప్రేమికులతో పాటు మరికొందరు ఆసక్తి ఈ పెయింటింగ్‌లను కొనడానికి ఎగబడ్డారు. దీంతో ఈ వరాహం వేసిన పెయింటింగ్‌లు వేలంపాట వేసి మరి అమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ పిగ్‌కాసో గీసిన పెయింటింగ్‌ ధర రూ. 2 లక్షలకు అమ్ముడుపోయింది. ఈ పిగ్‌ కాసో గీసిన మరో పెయింటింగ్‌ గతంలో రూ.20 లక్షలకు అమ్ముడు పోవడం విశేషం.