Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story What Happened That Day Between Ntr Mgr And Pv Narasimha Rao

ఆ రోజు… యన్టీఆర్ ఇంట్లో ఏం జరిగింది!?

Published Date :June 8, 2021 , 5:05 pm
By Prakash
ఆ రోజు… యన్టీఆర్ ఇంట్లో ఏం జరిగింది!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంప్రదాయాల గురించి చర్చించే సామాజిక వేదికల్లో తరచూ దర్శనమిచ్చే ఫోటో ఇది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో నటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్టీఆర్, ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో! ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం! ఇక ఈ ఫోటో 1972 సంవత్సరంలో తీసినది. అప్పట్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అదే సమయంలో తెలుగునేలపై ‘జై ఆంధ్రా ఉద్యమం’ తీవ్రంగా సాగుతోంది. అంతకుముందు ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ కూడా తీవ్రస్థాయిలోనే సాగింది. అప్పట్లో యన్టీఆర్ ‘పాలుపొంగు మన తెలుగు గడ్డనూ పగలగొట్టవద్దూ… ‘ అంటూ “తెలుగుజాతి మనది…నిండుగ వెలుగుజాతి మనది…” అని తన ‘తల్లా? పెళ్ళామా?’ చిత్రంలో నినదించారు. తెలంగాణ ఉద్యమాన్ని సద్దుమణిగేలా చేయడానికి అప్పటి కేంద్రప్రభుత్వం కొన్ని తాయిలాలు ప్రకటించింది. అవి ఆంధ్రప్రాంతం వారికి తీవ్రనిరాశను కలిగించాయి. దాంతో ‘జై ఆంధ్రా’ ఉద్యమం లేచింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమం మాంచి కాకమీద ఉన్నప్పుడే పి.వి.నరసింహారావు మద్రాసు సందర్శించారు. ఆ సమయంలో మద్రాసులో ఉన్న యన్టీఆర్, ఆయనను భోజనానికి పిలిచారు. అప్పటికే తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎమ్జీఆర్. ఆ సమయంలో ఎమ్జీఆర్ తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యుడుగా ఉన్నారు. దాంతో రామారావు, తాను ‘అన్న’ అంటూ ఎంతగానో అభిమానించే ఎమ్జీఆర్ ను కూడా విందుకు పిలిచారు. అలా యన్టీఆర్ ఇంట్లో పి.వి.నరసింహారావు, ఎమ్జీఆర్ కలుసుకున్నారు. కానీ, ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చేవారు. అందువల్ల కిందనే కూర్చుని భోజనం చేశారు. ఆ ఫోటో 1972 నాటి నుండి ఇప్పటి దాకా ఏదో ఒక సందర్భంలో దర్శనమిస్తూనే ఉంది. కరోనా కల్లోలం నేపథ్యంలో మన సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ, కింద కూర్చుని భోజనం చేయడం ఎంతో మంచిదని చెబుతూ, ఈ ఫోటోను సామాజిక మాధ్యమంలో విశేషంగా తిప్పుతున్నారు.

ఈ ముగ్గురి మధ్య మరో విశేషముంది? అదేమిటంటే, పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా 1971లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల 9 నెలలకే ఎమ్జీఆర్ తమిళనాడులో 1977 జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎమ్జీఆర్ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల 6 నెలలకు యన్టీఆర్ 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పీవీ నరసింహారావు కడదాకా కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. భారతదేశంలో తొలి దక్షిణాది ప్రధానమంత్రిగానూ పనిచేశారు. ఎమ్జీఆర్ తొలుత జాతీయ కాంగ్రెస్ లోనూ, ఆ పైన డి.ఎమ్.కె.లో ఉన్నారు. తరువాత కరుణానిధితో కలిగిన భేదాభిప్రాయాల వల్ల బయటకు వచ్చి అన్నా డి.ఎమ్.కె. పార్టీ పెట్టి 1977లో జయకేతనం ఎగురవేసి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యలో ఓ ఆరు నెలల మినహాయిస్తే, కడదాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు ఎమ్జీఆర్. ఇక యన్టీఆర్ సొంతగా తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కాగలిగారు. తరువాత 1984 ఆగస్టులో ఎమ్జీఆర్ లాగే బర్తరఫ్ అయినా, కేవలం నెల రోజులు ప్రజాపోరాటం చేసి, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇక యన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ స్థాపించినప్పుడు ఎమ్జీఆర్ కూడా ఆ ఫ్రంట్ భాగస్వామిగా ఉన్నారు. తెలుగుబిడ్డ అయిన పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు యన్టీఆర్ ఆనందించారు. అంతేకాదు, నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుండి పీవీ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తాను బద్ధ విరోధి అయినా, తెలుగువాడయిన పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటికి నిలబెట్టక పోవడం గమనార్హం!

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం

ఇలా ఈ ఫోటోల్లోని పీవీ, యన్టీఆర్, ఎమ్జీఆర్ కలయిక భావితరాలను సైతం ఆకర్షిస్తూనే ఉంది. వారి ఘనతను తెలియజేస్తూనే ఉండడం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MGR
  • ntr
  • pv narasimha rao

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions