ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తాటిపూడి రిజర్వాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోరున పడుతున్న వానలతో ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.. ఎప్పుడు ఏమౌతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంట్యాడ మండలం గోస్తనీ నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. విశాఖ ఏజెన్సీ అరకు అనంతగిరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు నీరు వచ్చి చేరడంతో తాటిపూడి రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 297 అడుగులు కాగా గరిష్ట నీటిమట్టం మించి ప్రవహించడంతో నీటి ఉధృతి ఎక్కువైంది. దీంతో గేట్ల పైనుంచి నీరు ప్రవహిస్తోంది.
గేట్లపై నుండి నీరు ప్రవహిస్తున్నా జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వుండడంతో సర్వత్రా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 295 అడుగులకు నీరు చేరుకోగానే గేట్లను కొంతమేరలేపి వరదనీటిని తగ్గించే అవసరం ఉంది. కానీ నేడు 297 అడుగులు దాటి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం

ఇంతటి ప్రమాదకర పరిస్థితులలో తాటిపూడికి నిత్యం వస్తున్న పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. తాటిపూడికి ఈ కార్తీక మాసంలో సందర్శకులు తాకిడి కూడా అధికంగా ఉంటుంది. సందర్శకులు ప్రమాదాలకు గురికాకుండా చూడవలసిన పోలీసులు కూడా కనీసం కనిపించడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి.. తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే తగిన హెచ్చరికలు జారీచేయాలని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!