Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ts High Court Key Orders On Bhoom Boi Case

భూమ్ బోయి మరణంపై హైకోర్ట్ కీలక ఆదేశాలు

Published Date :December 16, 2021 , 4:15 pm
By NTV WebDesk
భూమ్ బోయి మరణంపై హైకోర్ట్ కీలక ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లో రైతు భూమ్ బోయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది. పేకాట శిబిరంపై దాడి చేశారు బిచ్కుంద పోలీసులు. అక్కడే పొలంలో వడ్లకు కాపలా ఉన్న రైతు భూమ్ బోయిని చావ బాదారు పోలీసులు. గత నెల 11న భూమ్ బోయి చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసుల కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు భూమ్ బోయి కుటుంబ సభ్యులు.భూమ్ బోయికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బిచ్కుంద పోలీసులను స్టేషన్ లోని GD ఎంట్రీ ని అందజేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే..
దీపావళి పండుగ రోజు 04-11-2021న సాయంత్రం 5 గంటల సమయంలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో రైతు భూం బోయి (47 ఏళ్ళు) పొలంలో ఉన్నాడు. పేకాట శిబిరంపై దాడి పేరుతో అతన్ని బిచుకుంద పోలీసులు కొట్టటం చేత చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసుల దెబ్బలకు భూమ్ బోయి చనిపోయింది వాస్తవమా?అని తెలుసుకొనేందుకు పౌర హక్కుల ప్రజా సంఘం ప్రతినిధులు నిజ నిర్దారణ కమిటీ పరిశీలించింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది.

దీపావళి పండుగ రోజు శాంతాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం దగ్గర పేకాట ఆడుతున్న విషయం బిచుకుంద పోలీసులకు తెలిసింది. 8 మంది పోలీసులు దేవాలయం రెండు వైపుల నుండి వచ్చి అక్కడ వున్న అందరి పైన ఆకస్మిక దాడి చేశారు. ఆ దేవాలయం దగ్గర వడ్లు ఆరబోసుకున్న రైతులు కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తున్న రైతులు పోలీసులను చూసి పారిపోలేదు. పేకాట ఆడుతున్న వారు తలా ఒక దిక్కు పారిపోయారు. భూం బోయి రైతు వడ్లకు కాపలాగా వున్నాడు కాబట్టి పారిపోలేదు. కానీ పోలీసులు విచక్షణను కోల్పోయి బలంగా చెంపలపై కొట్టడంతో తల వెనుక భాగం గుడి గోడకు బలంగా గుద్దుకుంది. తర్వాత పిడిగుద్దులు గుద్దారు, తన్నారు. అక్కడే వడ్ల కుప్పలపై ఉన్న కర్రలతో కొట్టారు. పోలీసుల దెబ్బలకు భూం బోయ్ తలకు బలమైన గాయం తగిలింది, స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు వెళ్ళిపోతూ కల్లు తాగితే లేస్తాడు అని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయారు అని అధ్యయన కమిటీ తెలిపింది.

అనంతరం భూం బోయి కుటుంబ సభ్యులు బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి డాక్టర్స్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసారు. కానీ భూం బోయి 10-11-2021 న రాత్రి చనిపోయాడు. భూం బోయి భార్య లచ్చవ్వ పోలీసులు తన భర్తను చంపారు అని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే భయపెట్టి లచ్చవ్వను అధికారులు కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళగొట్టారు.

దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం దృష్టికి పౌరహక్కుల సంఘం తీసుకెళ్ళింది. హైకోర్టులో జస్టిస్ బి.విజయ్‌ సేన్ రెడ్డి ధర్మాసనం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మొత్తం మెడికల్ రిపోర్టు, పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు అందించాలని ఆదేశించారు . క్రైమ్ నంబర్ 179/2021 కు చెందిన GD ఎంట్రీతో సహా కోర్టుకు అందచేయాలని పోలీసులను ఆదేశిస్తూ డిసెంబర్ 22కి వాయిదా వేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'death
  • bhoom boi
  • bichkunda
  • farmer death
  • Highcourt

తాజావార్తలు

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్‌లో 14,000 మందిపై వేటు?

  • Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!

  • Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

ట్రెండింగ్‌

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions