హైటెక్ లో ‘గులాబీ’ ధగధగలు.. ప్లీనరీకి సర్వం సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపేలా ఆపార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయి. కరోనా, ఇతరత్రా కారణాలతో గడిచిన మూడేళ్లుగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగలేదు. ఆ లోటును భర్తీ చేసేలా ఈసారి ప్లీనరీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే భాగ్యనగరం గులాబీ మయంగా మారుతోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక ‘పింక్’ రంగు పులుముకుందా? అన్నట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ఆపార్టీ శ్రేణులు, నేతల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొందనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 25న ప్లీనరీ వేడుకలు జరుగున్నాయి. హైదరాబాద్లోని హైటెక్ వేదికగా జరిగే ఈ ప్లీనరీ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు దాదాపు 6వేల మంది హాజరు కానున్నారు. ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్ నేతలంతా గులాబీ దుస్తులను ధరించి రావాలని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా కోరడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ ప్లీనరీ సమావేశాల్లో ఆపార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
టీఆర్ఎస్ అధ్యక్ష పదవీకి గతంలో మాదిరిగానే ఈసారి ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. దీంతో పదోసారి కూడా కేసీఆరే ఆపార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనంగా కన్పిస్తోంది. ఇక ప్లీనరీలో ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ రోడ్లన్నీ కేసీఆర్ కటౌట్లు, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించే ప్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా 20మీటర్ల వెడల్పు కాన్వాస్పై ఇరవై ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్లతో ఎల్ఈడీ ధగధగలు, కళ్లకు కట్టినట్లు చూపేలా వేలాది ఫొటోలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను చూపించనున్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్లీనరీకి వచ్చేవారి కోసం ఆకట్టుకునే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ఆరువేల మంది కోసం దాదాపు 29 రకాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయనున్నారని సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ ఏర్పాట్లు చూస్తుంటే యావత్ భాగ్యనగరం గులాబీమయంగా మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!