Site icon NTV Telugu

ప్రధాని మోడీకి తిరుమల, శ్రీశైలం వేద పండితుల ఆశీస్సులు

నూతన సంవత్సరం 2022 సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయాలకు చెందిన వేదపండితులు ఢిల్లీ వెళ్ళారు.

ప్రధాని మోడీని కలిసి ఆయనకు శుభాశీస్సులు అందచేశారు. దేవస్థానాల నుంచి తీసుకెళ్ళిన ప్రసాదాలను ప్రధానికి అందచేశారు. అక్షింతలు వేదపండితులు ఆశీర్వచనాలు, దేవస్థానం తరఫున చిత్రపటాలు అందచేశారు. ప్రధాని మోడీ చేతికి కంకణాలు కట్టి, నుదుటిన తిలకం దిద్దారు వేదపండితులు.

Exit mobile version