రేపటి నుండి తెలంగాణాలో థియేటర్లు తెరచుకుంటున్నాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది.
అయితే… శనివారం తమ సమస్యలను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, థియేటర్ల యాజమాన్యంకు చెందిన ప్రతినిథులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి తీసుకెళ్ళారు. తమ ఇబ్బందులను లిఖితపూర్వకంగా మంత్రికి అందచేశారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల సందర్భంగా సి.ఎం. కేసీఆర్ సినిమా రంగానికి చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. వారి సమస్యలను సావకాశంగా విన్న మంత్రి శ్రీనివాస యాదవ్ సానుకూలంగా స్పందించారు. ‘సీఎం కేసీఆర్ మాట మీద నిలబడతారని, ఎగ్జిబిటర్స్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తార’ని తెలిపారు.
Also Read
దాంతో థియేటర్ల యాజమాన్యం ఆదివారం నుండి తమ సినిమా హాళ్ళను తెరుస్తామని మంత్రికి తెలిపింది. అందుబాటులో ఉన్న చిత్రాలతో తొలుత ప్రదర్శన మొదలు పెట్టడానికి ఎగ్జిబిటర్స్ సిద్ధమవుతున్నారు. నిర్మాతలు కొత్త చిత్రాలను విడుదల చేయడం మొదలు పెడితే, థియేటర్లు కళకళలాడటం ఖాయం. మరి ఆంధ్ర ప్రదేశ్ లోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపవచ్చని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి సినిమా హాళ్లూ తెరుస్తారేమో చూడాలి. ఇవాళ మంత్రి శ్రీనివాస యాదవ్ ను కలిసిన వారిలో సునీల్ నారంగ్, అభిషేక్ నామా, అనుపమ్ రెడ్డి, సదానంద్ గౌడ్, గోవింద రాజ్, కిశోర్ బాబు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!